‘ఆర్టికల్ 15’ సినిమాలో ట్రైబల్ అమ్మాయిగా నటించాను. ఇందులోనూ అదే తరహా పాత్ర కావడంతో దర్శకుడు తేజ నన్ను సంప్రదించారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకున్నాను.’ అని శివాని రాజశేఖర్ అన్నారు. రాహుల్ విజయ్తో కలిసి ఆమె నటించిన చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్’. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్కుమార్ కీలకపాత్రధారులు. తేజా మార్ని దర్శకుడు. గీతాఆర్ట్స్2 పతాకంపై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.
ఈ సందర్భంగా శివానీ బుధవారం విలేకరులతో ముచ్చటించింది. ‘ఇందులో నాది విలేజ్ కానిస్టేబుల్ పాత్ర. ఈ పాత్ర కోసం నాన్న కొన్ని సూచనలు చేశారు. మాతృక ‘నాయట్టు’లో చేసినవారి ప్రభావం పడకుండా, నా ైస్టెల్లో నేను చేశాను.’ అని చెప్పింది శివాని. సినిమా విడుదలకు ముందే ‘లింగిడి’ సాంగ్ మాకు మంచి గుర్తింపు తెచ్చిందని, ఈ పాట వల్లే ‘కోటబొమ్మాళి’కి ఇంత బజ్ వచ్చిందని, ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మిథున్ ముకుందన్కి థ్యాంక్స్ అని శివాని ఆనందం వ్యక్తం చేశారు.