Koffee with Karan | బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ (Karan Johar) వ్యాఖ్యాతగా చేస్తున్న కాఫీ విత్ కరణ్ షో (Koffee with Karan) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఏనిమిదో సీజన్ (Koffee with Karan New Season) కోసం రెడీ అవుతుంది. తాజాగా ఏనిమిదో సీజన్ సంబంధించి కరణ్ జోహార్ ఒక ప్రోమో కూడా విడుదల చేశాడు. అయితే ఈ సీజన్ నుంచి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఇన్నాళ్లు బాలీవుడ్ స్టార్స్తో చేసిన ఈ షో ఈ సారి మరింత కొత్తగా రానుంది. బాలీవుడ్తో పాటు సౌత్ సెలబ్రిటీలని తీసుకురాబోతున్నారు. ఇప్పటికే గత సీజన్లో సౌత్ స్టార్స్ విజయ్ దేవరకొండ, సమంతలు ఈ షోకు రాగా.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ షోకు రానున్నట్లు సమాచారం వచ్చింది. ఇక ఈ షోకు వచ్చే వారిలో ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో వరల్డ్ వైడ్ పాపులర్ అయిన జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR), రామ్ చరణ్(Ram Charan), అలాగే పుష్ప సినిమాతో ఇండియా వైడ్ పాపులర్ అయినా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)లు రానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇటు ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ కానీ.. అటు కరణ్ జోహార్ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఇక ఈ షోలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్తో పాటు జవాన్తో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), బాలీవుడ్ క్యూట్ కపుల్స్ అలియా భట్ – రణబీర్ కపూర్, దీపికా పదుకొనే -రణవీర్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ, ఆర్చీస్ (Archies Crew) మూవీ టీం హాజరుకానున్నట్లు సమాచారం. ఇక వీరితో పాటు జవాన్ దర్శకుడు అట్లీ (Atlee), పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ వస్తున్నట్లు బీ టౌన్ టాక్.
కాఫీ విత్ కరణ్ సీజన్ 8 (Koffee with Karan 8) అక్టోబర్ 26 నుంచి ప్రారంభంకానుంది. గత సీజన్ లానే ఈ సీజన్ కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ+ హాట్స్టార్లో టెలికాస్ట్ అవ్వనుంది. ఇక ఈ సారి కూడా సౌత్ సెలబ్రిటీలు వస్తుండటంతో సౌత్ ఆడియన్స్ కూడా ఈ షోపై ఆసక్తి చూపిస్తున్నారు.