‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన తొలి తమిళ చిత్రం ‘కిడ’. ఆర్.కె.వెంకట్ దర్శకత్వం వహించారు. పూరాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తెలుగులో ‘దీపావళి’ పేరుతో అనువదిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 11న విడుదల కానుంది. ‘ఓ తాత, ఓ మనవడు, ఓ మేక.. ఈ మూడింటి చుట్టూ కథ నడుస్తుంది. అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది.
గ్రామీణ నేపథ్యంలో హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. ‘స్రవంతి’ రవికిషోర్ మాట్లాడుతూ ‘ఓ స్నేహితుడి ద్వారా ఈ కథ విన్నా. వెంటనే కనెక్ట్ అయ్యాను. తొలి చిత్రమైనా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎం.జయప్రకాష్, సంగీతం: థీసన్.