Pawan Kalyan-vijay Devarakonda | విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన ‘లైగర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. దీంతోపాటుగా మరోసారి పూరీ దర్శకత్వంలోనే ‘జనగణమన’ సినిమాను చేయనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉండటంతో జనగణమన షూటింగ్ కాస్త లేట్గా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో విజయ్, శివ నిర్వాణతో సినిమాను ముందుకు తీసకురానున్నాడు.
నిజానికి శివ నిర్వాణ ‘మజిలీ’ తర్వాత విజయ్తో సినిమా చేయాల్సిఉంది. అప్పటికే విజయ్తో స్టోరీ ఫైనల్ కూడా అయింది. కానీ విజయ్ ‘లైగర్’తో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా లైగర్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుండటంతో విజయ్ పూర్తి ఫోకస్ అంతా లైగర్ పైనే పెట్టాడు.ఇప్పుడు లైగర్ షూటింగ్ పూర్తి కావడంతో శివ నిర్వాణ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 23నుంచి రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించనున్నట్లు టాక్. ఈ చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్ను పరిశీలనలో ఉంచారట. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బాస్టర్గా నిలిచిన ఖుషి టైటిల్ను ఈ చిత్రానికి అనుకోవడంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ అధికారిగా నటించనుండగా సమంత కాశ్మీరి అమ్మాయిగా నటించనుంది.