మహానటి చిత్రంతో నేషనల్ అవార్డ్ దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్(Keerthy suresh). చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయం ఉన్న కీర్తి సురేష్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలవనుంది. అయితే ఒకవైపు కథానాయికగా నటిస్తూనే చెల్లెలి పాత్రలో నటిస్తుండడం అభిమానులని కాస్త ఆందోళనకు గురి చేస్తుంది.
కీర్తి సురేష్.. రజనీకాంత్(Rajinikanth) అన్నాత్తెలో ఆయన చెల్లెలి పాత్ర పోషించింది. ఇక చిరంజీవి(Chiranjeevi) భోళా శంకర్ చిత్రంలో ఆయనకు చెల్లెలిగా కనిపించనుంది. ఇద్దరు లెజెండ్స్తో స్క్రీన్ షేర్ చేసుకుని లక్కీ గార్ల్గా అందరి చేత అనిపించుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే .. ఈ బ్యూటీ బిగ్ స్టార్స్కి చెల్లెలుగా నటిస్తుండడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.కీర్తి చెల్లెలకు కేరాఫ్గా మారిపోతున్నావ్ ఏంటి? అంటూ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈ అమ్మడు మాత్రం మంచి పాత్ర ఏదైన నటించాలనే కసితో ఉన్నట్టు తెలుస్తుంది.