తన సినిమాపై సాంఘిక మాధ్యమంలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కథానాయిక కీర్తి సురేశ్ కౌంటరిచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, కల్యాణ్రామ్ హీరోలుగా రూపొందుతున్న భారీ చిత్రంలో కీర్తి సురేశ్ ఓ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె వెంకటేష్ జోడీగా నటిస్తున్నది. ఈ సినిమా.. మలయాళంలో 2024లో వచ్చిన ‘గురువాయూర్ అంబలనాదయిల్’ చిత్రం రీమేక్గా తెరకెక్కుతున్నదని ఇన్స్టాలో ఎవరో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ వైరల్గా మారింది. దానికి కీర్తి సురేశ్ స్పందిస్తూ.. ‘అందులో ఏ మాత్రం నిజం లేదు.
ఇది కొత్త కథ. అందరూ మెచ్చే కథ’ అంటూ కామెంట్ పెట్టింది. దీంతో వెంకీ, కల్యాణ్రామ్ చిత్రంపై వస్తున్న గాలి వార్తలకు చెక్ పెట్టినట్టయింది. రాయలసీమ నేపథ్యంలో, అనిల్ మార్క్ కామెడీతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈచిత్రానికి ‘జనవరి 13న విడుదల’ అనే టైటిల్ని కూడా అనుకుంటున్నారు.