Keeda Cola Movie | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్. ‘కీడా కోలా’ (Keedaa Cola) సినిమా చూడాలనుకునే సినీ ప్రేక్షకుల కోసం చిత్రబృందం బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈ సినిమా మల్టీప్లెక్స్లో చూసేవారికి టికెట్ కేవలం రూ. 112కే లభిస్తుందని.. బుధవారం (నవంబర్ 08) నుంచి శుక్రవారం (నవంబర్ 10) వరకు ఈ ఆఫర్ను వాడుకోవచ్చని ‘కీడా కోలా’ చిత్రయూనిట్ పేర్కొంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రాసుకోచ్చింది. ఇక తెలంగాణలోని మల్టీప్లెక్స్ల్లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అయితే ఈ ఆఫర్ మల్టీప్లెక్స్లోని రెక్లైనర్స్కు మాత్రం వర్తించదని చెప్పింది.
పెళ్లి చూపులు (Pelli Choopulu), ఈ నగరానికి ఏమైంది (ENE) చిత్రాల తర్వాత తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయ దర్శకత్వంతో వచ్చిన చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola). బ్రహ్మనందం, చైతన్య రావు, రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ నగరానికి ఏమైంది సినిమా తరువాత ఐదేండ్లు గ్యాప్ తీసుకుని తరుణ్ భాస్కర్ ఈ సినిమా తీయగా.. తొలి రోజు నుంచే భారీగా వసూళ్లు రాబడుతుంది.
Experience #KeedaCola 🪳 on the big screen at just Rs. 112 in all Telangana multiplexes (except recliners)!🍿🎫
From tomorrow till Friday.https://t.co/0Qz8FGY3NS@TharunBhasckerD @RanaDaggubati @IamChaitanyarao @smayurk @tweetfromRaghu @JeevanKumar459 @IamVishnuOi… pic.twitter.com/YoRH7WyP2c
— Suresh Productions (@SureshProdns) November 7, 2023