సత్యం రాజేష్, చిత్రం శ్రీను, రక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కళాపురం’. కరుణ కుమార్ దర్శకుడు. జీ స్టూడియోస్, ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రజనీ తాళ్లూరి నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘పాండమిక్ టైమ్లో ఈ సినిమాను మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేశాం.
ఈ సినిమా కథకు సత్యం రాజేష్ చక్కగా సరిపోయాడు. మణిశర్మ అద్భుతమైన రీకార్డింగ్ ఇచ్చారు. సాంకేతికంగా కూడా ఉన్నతంగా ఉంటుందీ చిత్రం. కామెడీ డ్రామాగా అలరిస్తుంది. ఆరోగ్యకరమై హాస్యంతో మెప్పిస్తుంది’ అన్నారు. సత్యం రాజేష్ మాట్లాడుతూ ‘నా కెరీర్లో ఈ సినిమాకు ఎంతో ప్రత్యేకత ఉంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’ అన్నారు.