బిగ్ బాస్ ఆడియన్స్ మోస్ట్ వెయిటెడ్ ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చేసింది. ప్రస్తుతం హౌస్లో ఎనిమిది మంది సభ్యులు ఉండగా.. వారికి సంబంధించి హౌస్లోకి ఒక్కొక్కరిని పంపబోతున్నారు బిగ్ బాస్. గత సీజన్స్లో కరోనా నేపథ్యంలో గ్లాస్ చాంబర్లో ఉంచి మాట్లాడించేవారు . కాని ఇప్పుడు కరోనా కాస్త తగ్గింది కాబట్టి మూడు రోజులు క్వారంటైన్లో ఉంచి బిగ్ బాస్ హౌజ్లోకి ప్రవేశపెడుతున్నారు.
బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ నడుస్తున్న సమయంలో అందరూ పాజ్లో(ఆగిపోయి) ఉన్నప్పుడు కాజల్ భర్త, కూతురు హౌస్లోకి వచ్చారు. తన తల్లి కాజల్ని చూడగానే ఆమె కూతురు మమ్మీ అంటూ పరుగు పరుగున వెళ్లడం కళ్ల చెమ్మగిల్లేట్టు చేసింది. దగ్గరకు వెళ్లి కదలొద్దమ్మా అని చెప్తూ.. బిగ్ బాస్ నుంచి ఆదేశం వచ్చిన తరువాత తన తల్లినిపట్టుకుని ఏడ్చేసింది కాజల్ కూతురు.
నువ్వు ఇక్కడివరకు వస్తావనుకోలేదని కూతురు అనడంతో కాజల్ నవ్వేసింది. కనీసం టాప్ 5కి చేరుకున్నా సంతోషమే అని చెప్పింది. మీ మమ్మీని నామినేట్ చేస్తుంటే కోపం వస్తుందా? అని శ్రీరామ్ కాజల్ కూతుర్ని అడగ్గా.. ఆమె ఓ రేంజ్లో క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. యానీ మాస్టర్పై చాలా సార్లు కోపం వచ్చింది. ఆమె ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉంది అంటూనే జోకింగ్ అనేసింది. కాజల్ తన భర్త, కూతురితో సరదాగా గడిపాక వారిద్దరిని బయటకు పంపారు. ఇక ఈ రోజు శ్రీరామ్ సోదరి, మానస్ తల్లి రాబోతుంది .