వివాహనంతరం సినిమాల వేగాన్ని పెంచింది పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజను సినిమాలున్నాయి. కథాంశాల ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తోన్న ఈ సొగసరి వైవిధ్యమైన పాత్రల్లో రాణించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోన్న కాజల్ అగర్వాల్ తాజాగా ప్రభాస్తో ఓ ప్రత్యేక గీతంలో నర్తించడానికి అంగీకరించిందని సమాచారం. వివరాల్లోకి వెళితే…ప్రభాస్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో పునఃప్రారంభంకాబోతుంది.
ఈ సినిమాలోని ఓ స్పెషల్సాంగ్లో ప్రభాస్తో కలిసి కాజల్ అగర్వాల్ చిందేయనున్నట్లు తెలిసింది. గతంలో వీరిద్దరు కలిసి ‘డార్లింగ్’ ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ వంటి విజయవంతమైన చిత్రాల్లో చూడచక్కని జోడీగా మెప్పించారు. ప్రేక్షకుల్లో ఈ హిట్పెయిర్కున్న ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకొని ‘సలార్’ చిత్రం బృందం ఓ హుషారైన ప్రత్యేకగీతానికి ప్లాన్ చేసిందట. సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్తో కలిసి తెరను పంచుకునే అవకాశం రావడంతో కాజల్ అగర్వాల్ ఈ ఐటెంసాంగ్కు వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు. ‘జనతాగ్యారేజ్’ చిత్రంలో ‘పక్కా లోకల్..’ ప్రత్యేకగీతంలో కాజల్ అగర్వాల్ యువప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ సొగసరి స్పెషల్సాంగ్లో నర్తించబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.