బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 లో ఫస్ట్ నుండి ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనే విషయంలో కాస్త క్లారిటీ ఉన్నా.. బిగ్ బాస్ కొంతమంది పేర్లను సీక్రెట్ గా ఉంచారు. అలా సీక్రెట్ గా ఉంచిన పేర్లలో జెస్సీ కూడా ఒకరు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ఎవరు.. ఏంటి అనే విషయంపై ఆడియన్స్ ఎంక్వయిరీ చేశారు. అందరి కంటెస్టెంట్స్ కి టఫ్ కాంపిటేషన్ ఇచ్చి.. బిగ్ బాస్ హౌస్ లో పది వారాలు ఉన్నారు జస్వంత్. చివరికి బిగ్ బాస్ హౌస్ నుండి హెల్త్ ప్రాబ్లెమ్ తో బయటకు వచ్చేశారు.
మోడల్ అయిన జెస్సీ బిగ్ బాస్ లోకి రావడంతో ఆడియన్స్ సర్ ప్రైజ్ అయ్యారు. ఈ క్రమంలోనే జెస్సీ రికమండేషన్ మీద వచ్చాడని, జెస్సీ, బిగ్ బాస్ వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి మరీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడని రూమర్స్ వచ్చాయి. బిగ్ బాస్ యూనిట్ కి 20 లక్షలకు పైగా ఇచ్చాడని అన్నారు. ఈ మాట నెటిజన్లతో పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా అన్నారట.
ఈ క్రమంలో జెస్సీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తనపై వచ్చిన రూమర్స్ నేను నా అకౌంట్ లో ఎన్ని డబ్బులున్నాయో చూపిస్తున్నానని.. నా అకౌంట్ డీటైల్స్ అన్ని ఇస్తాను. అలాగే నాకు ఉన్నది ఒకే అకౌంట్ అని అందులో 11 వేలు మాత్రమే ఉన్నాయని అన్నారు. బిగ్ బాస్ వాళ్ళే డబ్బులు ఎదురిస్తారని.. తాను ఫైనాన్షియల్ గా చాలా వీక్ అని, తనకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదని, జెస్సీ నాన్న చనిపోయారని, తాను నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తూ.. దాచుకున్న డబ్బులతో మోడలింగ్ నేర్చుకున్ననని అన్నారు.
అలాగే రూపాయి విలువ నాకు బాగా తెలుసు, దేవుడు నా కష్టాన్ని చూసి బిగ్ బాస్ ఆఫర్ ని ఇచ్చాడని అన్నారు. ఇక మోడలింగ్ లో ఉండటం వల్ల నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి నేను రిచ్ అని, బిగ్ బాస్ టీమ్ కి డబ్బులిచ్చి లోపలికి వెళ్ళానని అనుకున్నారని.. కానీ అది ఏమాత్రం నిజం కాదని జెస్సీ అన్నారు. అలాగే తన టాలెంట్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చానని.. అంతే నిజాయితీగా గేమ్ ఆడానని అన్నారు.
ఇక జెస్సీ మోడలింగ్ తో పాటుగా సీరియల్, సినమాల్లో నటించారు. ఫ్యాషన్ రంగంలో మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్నారు. 2020 లో ఎంతమంచి వాడవురా సినిమాలో కనిపించారు. ప్రస్తుతం జెస్సీ కామెడీ షోస్ లో సందడి చేస్తున్నాడు.