అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో కథానాయికగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. వైవిధ్యమైన ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. అయితే జాన్వీ కళాకారిణే కాదు చిత్రకారిణి అని గతంలో తన టాలెంట్ చూపించింది. తాజాగా మరో సారి తన కుంచెకు పని చెప్పింది జాన్వీ. తను వేసిన అందమైన బొమ్మను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. ఇప్పుడైన నన్ను మంచి ఆర్టిస్ట్ అని ఒప్పుకుంటారా అని కామెంట్ పెట్టింది.
జాన్వీ ప్రశ్నకు నెటిజన్స్ నుండి డిఫరెంట్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే జాన్వీ హిందీ పరిశ్రమకే పరిచయం కాకుండా తెలుగు, తమిళ భాషలలో కూడా అలరించే ప్రయత్నం చేస్తుంది. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాతో జాన్వీ టాలీవుడ్కి ఎంట్రీ ఇవ్వనుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావలసి ఉంది .