Jana Nayagan Second Look | తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ మరికొన్ని రోజుల్లో సినిమాలు దూరమవుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ తమిళ వెట్రి కళగం(TVK) అనే పార్టీని స్థాపించాడు. ఇక నుంచి తాను పూర్తిగా రాజకీయల్లోనే ఉంటానని.. ఇదే తన చివరి చిత్రం అంటూ దళపతి69 (Thalapathy69) ప్రాజెక్ట్ను ప్రారంభించాడు. జన నాయగన్ (ప్రజల నాయకుడు) అనే టైటిల్తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ను కార్తీ (ఖాకీ) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హెచ్.వినోద్ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్లను విడుదల చేయగా.. ఇందులో విజయ్ ప్రజల నాయకుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించి ఒక వార్త వైరల్గా మారింది. విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ మూవీ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. దీనికోసం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం కోసం ఏకంగా రూ.121 కోట్లు చెల్లించి, ‘జన నాయగన్’ యొక్క పాన్ ఇండియా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ మూవీని నిర్మించనుంది. ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.