యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ ‘ఆదిపురుష్’కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో, సన్నీ ఆయన సోదరుడు లక్ష్మణుడి పాత్రలో కనిపిస్తారు. సైఫ్ అలీ ఖాన్ లంకేశుడిగా, కృతి సనన్ సీతాదేవి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
తాజాగా చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. లంకేశుడి పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది. లంకేశుడి పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్తో కేక్ కట్ చేయించి సెండాఫ్ ఇచ్చారు. అయితే ఆదిపురుష్ వంటి భారీ ప్రాజెక్ట్లో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రభాస్తో కలిసి పని చేయడం ఎంతో గొప్పగా అనిపించింది. ఆయన ఎంతో మంచి మనిషి. జెంటిల్మెన్. అంటూ ప్రభాస్ గురించి సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.