గతేడాది ఇండస్ట్రీలోకి ఎంతో మంది కొత్త దర్శకులు అడుగుపెట్టారు. అందులో కొందరు మొదటి అడుగులోనే విజయం సాధిస్తే.. మరికొందరు పరాజయాల్ని మూటగట్టుకున్నారు. ఇక గతేడాది దర్శకుడిగా సినీ ప్రయాణం మొదలు పెట్టి సక్సెస్ సాధించిన వాళ్లలో మల్లిడి వశిష్ట ఒకడు. ‘బింబిసార’ సినిమాతో ఈ యువ దర్శకుడు సినిమాల్లోకి ప్రవేశించాడు. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని తన వైపు చూసేలా చేశాడు. 20కోట్ల మార్కెట్ లేని కళ్యాణ్ రామ్ను ఏకంగా 70కోట్ల క్లబ్లో నిలబెట్టాడు. తొలి సినిమాకే కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకుని ఎంతో నైపుణ్యంగా తీర్చిదిద్దిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు.
ప్రస్తుతం టాలీవుడ్లో వశిష్టకు డిమాండ్ మాములుగా లేదు. ఆయనతో సినిమా చేయాలని ఎందరో హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి మల్లిడి వశిష్ట.. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో తొలి సినిమా చేయాల్సి ఉంది. అల్లు శిరీష్ను హీరోగా పెట్టి ఓ సినిమా ప్లాన్ చేశాడు. కానీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక ఇప్పుడు అదే గీతా ఆర్స్ట్ సంస్థ బడ్జెట్ ఎంతైనా సరే వశిష్టతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తుందట. ఇక ఇదిలా ఉండగానే గత కొన్ని రోజుల ముందు వశిష్ట ఏకంగా సూపర్ స్టార్ రజనీకు స్టోరీ నెరేట్ చేశాడు. రజనీ కూడా సానుకూలంగానే స్పందించినట్లు టాక్. కాగా రజనీ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం వేయిట్ చేస్తున్నాడట.
మరోవైపు వశిష్ట, నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. బింబిసార స్పెషల్ షో చూసిన బాలకృష్ణ.. వశిష్ట ప్రతిభను మెచ్చి ఓ కథను సిద్ధం చేయమని అప్పుడే చెప్పాడట. అయితే తాజాగా కథ సిద్ధం కావడంతో వశిష్ట, బాలయ్యకు నెరేషన్ ఇచ్చాడు. బాలయ్య కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం బాలయ్య చేతిలో ఉన్న ప్రాజెక్ట్లు పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ ఉంది. ఇలా ఒక్క సినిమాతోనే వశిష్ట టాలీవుడ్లో మంచి డిమాండ్ ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం వశిష్ట బింబిసార-2 ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.