NTR30 Movie | ‘ఆచార్య’ సినిమాతో కొరటాలకు కోలుకోలేని దెబ్బపడింది. ఈ సినిమా ఫ్లాప్ అవడమే కాకుండా శివ కెరీర్లో ఒక మచ్చలా మిగిలిపోయింది. సగటు ప్రేక్షకుడు కూడా ఈ సినిమా చూసినప్పుడు అసలు ఇది కొరటాల శివ సినిమానేనా అనే డౌట్లు కూడా వచ్చాయి. అయితే ఒక్క ఫేయిల్యూర్తో డైరెక్టర్ క్యాలిబర్ను అంచనా వేయడం కష్టం. ప్రస్తుతం కొరటాల, ఎన్టీఆర్తో తీయబోయే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆచార్య విషయంలో జరిగిన పొరపాట్లు ఈ సినిమాలో ఎట్టి పరిస్థుతుల్లో జరగకూడదని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో మరింత దృష్టి సారించాడు. అందువల్లే ఈ సినిమా పట్టాలెక్కడానికి సమయం పడుతుంది.
ఇక ఇటీవలే అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన అప్డేట్ చెప్పి ఫ్యాన్స్ను ఖుషీ చేశాడు. ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ ఫిబ్రవరిలో ఉంటుందని, రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో మొదలు పెడతామని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన వార్తలు రోజుకొకటి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా ఐలాండ్-పోర్ట్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
టాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఈ సినిమా కోసం చియాన్ విక్రమ్ రంగంలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో హీరోకు సమానంగా విలన్ పాత్ర ఉండనుందట. ఈ క్రమంలో మేకర్స్ విక్రమ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. గతంలో విక్రమ్ విలన్, ఇంకొక్కడు వంటి సినిమాల్లో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలతో మెప్పించాడు. ఇక ఇప్పుడు ఏకంగా తారక్ సినిమాలో విలన్గా చేయడమంటే విశేషం అనే చెప్పాలి. అయితే మేకర్స్ ఒక్కరితోనే కట్టుబడి కూర్చోలేరట. ఒకవేళ విక్రమ్ చేయకపోతే సైఫ్ అలీఖాన్ను రంగంలోకి దింపనున్నారట. ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండక తప్పదు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొరటాల శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ యువసుధ ఆర్స్ట్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. ఇక నందమూరి ఆర్స్ట్ బ్యానర్పై కళ్యాణ్రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తారక్కు జోడీగా జాన్వీ కపూర్ నటించనుంది.