టాలీవుడ్ హీరో మహేశ్ బాబు తల్లి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి అంత్యక్రియలు (Indira Devi Cremations) కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం (Mahaprasthanam)లో కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఇందిరాదేవి (Indira Devi) అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం తెల్లవారు జామున ఇందిరాదేవి అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
ఇందిరాదేవి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాద్లోని పద్మాలయ స్టూడియోస్లో ఉంచారు. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఇందిరాదేవి పార్దీవదేహానికి నివాళులర్పించారు. ఇందిరాదేవి మృతి పట్ల సంతాపం ప్రకటించిన సినీ ప్రముఖులు.. కృష్ణ, మహేష్ బాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు.
కాగా ఈ ఏడాది కృష్ణ కుమారుడు రమేశ్ బాబు కన్నుమూశారు. కొద్దికాలంలోనే ఇందిరాదేవి కూడా చనిపోవడంతో ఘట్టమనేని ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.