‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో చివరి ఇరవై నిమిషాలతో పాటు పతాక సన్నివేశాలు ది బెస్ట్గా వుంటాయి. నా కెరీర్లో ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో ఇది ది బెస్ట్ క్లయిమాక్స్ అని చెప్పగలను. ఈ విషయంలో గర్వంగా ఫీలవుతున్నా’ అన్నారు దర్శకురాలు నందిని రెడ్డి. ‘ఓ బేబి’ లాంటి విజయవంతమైన సినిమా తరువాత ఆమె దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్న సినిమాస్, మిత్రవిందా మూవీస్ పతాకాలపై ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మించారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకురాలు నందిని రెడ్డితో జరిపిన ఇంటర్వ్యూ ఇది.
ఈ చిత్రంలో ఓ కొత్త పాయింట్ను చర్చించబోతున్నాం. రాయడానికి స్కోప్ వున్న కథ ఇది. హీరో, హీరోయిన్లతో పాటు అన్ని పాత్రలకు మంచి ప్రాధాన్యత వున్న కథ ఇది. విక్టోరియా పురం అనే ఊరి కథ ఇది. ఆ ఊరికి, ఈ పాత్రలకు వున్న సంబంధం ఏమిటి? లవ్స్టోరీకి వున్న సంబంధం ఏమిటి? ఇలా అన్ని లింక్తోనూ వుంటాయి.
ఆంధ్ర, తమిళనాడు బోర్డర్లో వున్నదే విక్టోరియా పురం. కాఫీ తోటలకు ప్రసిద్ది. అక్కడ చెఫ్ పెట్టే కాఫీని రాణి చాలా ఇష్టంగా తాగుతారు. అలా ఆ ఊరు ఫేమస్ అయింది. కాఫీ ఎస్టేట్, రెండు కుటుంబాలు, నాలుగు జనరేషన్స్, కోర్టుకేసు ఇలా అన్ని అంశాలతో ఫ్యామిలీ ఎమోషన్స్తో ప్రేక్షకులను కట్టిపడేసేలా వుంటుంది.
కథకు కావాల్సిన అంశాలు వుంటూ కథ జరిగే క్రమంలో అందరికి ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా వుంటాయి. దానితో పాటు ఎంటర్టైన్ చేశామా లేదా అనేది కూడా చూసుకుంటాను. అందుకే అన్ని పాత్రలతో అల్లుకుపోతూ అందరిని మెప్పించే ప్రయత్నం చేశాను.
తప్పకుండా వుంటుంది. వారు సక్సెస్ ఇచ్చారు. నేనూ సక్సెస్ అవ్వాలనే కసితో చేశాను. టెన్షన్ వుంటుంది. అయితే ఇప్పటి వరకు చూసినవారంతా చెప్పిన ఫీడ్బ్యాక్తో ఆ టెన్షన్ కూడా పోయి హ్యాపీగా వుంది.
రొటీన్గా కథలు చెప్పకుండా వుండటమే దానికి పరిష్కారం. అందుకే ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఊహించని విధంగా వుండేలా కథలు రాస్తున్నాను. జాతిరత్నాలు, బలగం వంటి సినిమాలు వచ్చాయంటే చిన్న పాయింట్ అయినా కుటుంబమంతా కలిసిచూసి ఎంజాయ్ చేసేలా వుంది.
ఎవరూ ఊహించని కథతో నా తదుపరి సినిమా వుంటుంది. వినూత్నంగా అందర్ని ఆశ్చర్యపరిచేలా ఈసారి సినిమా చేయబోతున్నా.