Ilayaraja live concert | మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్ కన్సర్ట్ కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. గతంలో ఈయన ఎస్పీ బాలసుబ్రమణ్యం, కే.జే ఏసుదాసు వంటి దిగ్గజ గాయకులతో చేసిన లైవ్ కచేరీలను డిజిటల్, శాటీలైట్ ప్రసారాల్లో లక్షల మంది వీక్షించేవారు. మళ్లీ ఎప్పుడు ఈయన లైవ్ కన్సర్ట్ చేస్తారా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇళయరాజ సంగీత ప్రియులకు ఓ శుభవార్త చెప్పాడు. అదేంటంటే ఇళయరాజా పాండమిక్ తర్వాత తొలి లైవ్ కన్సర్ట్ చేయ్యబోతున్నట్టు వెల్లడించాడు.
‘రాక్ విత్ రాజా’ పేరుతో వచ్చే నెలలో చెన్నైలో ఈ సంగీత కచేరీని నిర్వహించబోతున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘సీ యూ ఆల్ సూన్.. లైవ్ ఇన్ చెన్నై’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో ఇళయరాజా వైట్ సూట్లో నిల్చున్న ఫోటోతో రాక్ విత్ రాజా అనే టైటిల్తో పోస్టర్ను విడుదల చేశారు. ఈ లైవ్ కన్సర్ట్లో పేరున్న గాయనీ గాయకులు పాల్గొనబోతున్నారు. మార్చి నెలలో జరగబోతున్న ఈ కన్సర్ట్ తేదీ ఇంకా ఖరారు చేయలేదు.
See you all soon
LIVE in Chennai 🎸 🎸 #RockWithRaaja 🔥#LiveInConcert #March2022 pic.twitter.com/goQWGl080D— Ilaiyaraaja (@ilaiyaraaja) February 9, 2022