బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిదో వారం గేమ్ రంజుగా సాగుతుంది. కెప్టెన్ పోటీదారల కోసం అభయహస్తం అనే టాస్క్ ఇవ్వగా, ఈ టాస్క్లో ఇప్పటికే సిరి, షణ్ముఖ్, శ్రీరామ్ ముగ్గురూ కెప్టెన్ పోటీదారుల రేస్లో గెలిచి హౌజ్లో ఉన్నారు. మిగతా వారంతా బయటనే ఉన్నారు.గెలిచిన వారికి మాత్రమే లోపలికి పర్మీషన్ ఉంటుందని బిగ్ బాస్ చెప్పడంతో మిగతా వారంతా బయటనే దుప్పట్లు చాపలు వేసుకొని పడుకున్నారు.
ఇక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నాలుగో రౌండ్లో జెస్సీ తాను డ్రాప్ అవుతానచి చెప్పాడు. మొదట ఆరోగ్యం బాగోలదేని చెప్పిన ఆయన మళ్లీ ఆడతానని అన్నాడు. జెస్సీకి ఆడాలని ఉన్నందున అతడి కోసం టాస్క్లో నుంచి వైదొలగడానికి అనీ, సన్నీ సిద్ధమయ్యారు.ఈ క్రమంలో షణ్ముఖ్.. నీకు హెల్త్ బాలేదని డ్రాప్ అవుతున్నానని చెప్పు అంతేతప్ప ఎవరో డ్రాప్ అవుతున్నారని నువ్ కావడం కాదని చురక వేశాడు.
పలు చర్చల అనంతరం నాలుగో రౌండ్ టాస్క్కి పింకీ, ఆనీ మాస్టర్లు పోటీపడ్డారు. బోర్డ్పై రంగులు నింపే ఈ ఛాలెంజ్లో పోటా పోటీగా రంగులు నింపుతుండగా.. అనీమాస్టర్ , పింకీ ఇద్దరు కింద పడ్డారు.అయితే పింకీ నడుముకి గట్టిగా దెబ్బ తగలడంతో కాసేపు విలవిలలాడింది. చివరిగా కాన్వాస్పై ఎవరి రంగు ఎక్కువగా ఉంటుందో వాళ్లు గెలిచినట్లు అని చెప్పడంతో టాస్క్లో ప్రియాంకపై అనీ గెలిచిందని చెప్పారు. దీంతో అనీకి కూడా ఇంట్లోకి వెళ్లే ఛాన్స్ దక్కింది.