‘ఇంతకు ముందు నేను కొన్ని థ్రిల్లర్ సినిమాలు చేశాను. కానీ అందులో ‘హిడింబ’ చాలా డిఫరెంట్. ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో కనిపిస్తాను’ అన్నారు నందితా శ్వేత. ఆమె నటించిన తాజా చిత్రం ‘హిడింబ’. అశ్విన్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి అనీల్ కన్నెగంటి దర్శకుడు.గంగపట్నం శ్రీధర్ నిర్మాత. ఈ నెల 20న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ నందితా శ్వేత విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ఆమె మాట్లాడుతూ ‘హిడింబ చిత్రం యూనిక్ పాయింట్తో రాబోతున్న డిఫరెంట్ థ్రిల్లర్. ఇందులో నాది హీరోకి ఈక్వెల్గా వుండే చాలా బలమైన పాత్ర. మెంటల్గా, ఫిజికల్గా నాది సవాల్తో కూడిన పాత్ర. ‘హిడింబ’ ఒక్క మాటలో చెప్పాలంటే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా వుంటుంది. ఈ చిత్రంతో నాకు హీరోయిన్గా మంచి గుర్తింపుతో పాటు స్టార్డమ్ వస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.