‘బేబీ’ ఫేం విరాజ్ అశ్విన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ కథానాయిక. అను ప్రసాద్ దర్శకుడు. నిరీష్ తిరువీధుల నిర్మాత. ఈ నెల 15న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ని ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా చేతులమీదుగా విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని బుచ్చిబాబు చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అందించారు. ‘బేబీ’ సినిమాతో యువతకు చేరువైన విరాజ్ ఈ సినిమాతో యువతకు మరింత దగ్గరవుతాడని, కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని దర్శకుడు చెప్పారు. ‘జోరుగా హుషారుగా’ అనే టైటిల్కి తగ్గట్టే ఈ చిత్రంలో అందర్నీ ఆకట్టుకునే వినోదం ఉంటుందని, యువతరం మెచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తుందని నిర్మాత తెలిపారు.