సాయిరామ్ శంకర్, యాశ శివ కుమార్ జంటగా నటిస్తున్న చిత్రం ‘వెయ్ దరువెయ్’ నవీన్ రెడ్డి దర్శకుడు. దేవరాజు పొత్తూరు నిర్మాత. ఈ చిత్రం టీజర్ను ఇటీవల హీరో సాయిధరమ్ తేజ్ విడుదల చేశారు.
సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ ‘ ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. వైవిధ్యమైన కథతో దర్శకుడు చిత్రాన్ని జనరంజకంగా తీర్చిదిద్దాడు. తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: జనగాని కార్తీక్, శ్రీపాల్ చొల్లేటి.