ఉదయ్రాజ్, వైష్ణవిసింగ్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మధురం’. ‘ఎ మెమరబుల్ లవ్’ అనేది ఉపశీర్షిక. రాజేశ్ చికిలే దర్శకుడు. ఎం.బంగార్రాజు నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ దశలో ఉంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీజర్ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. హీరో నితిన్ ఈ టీజర్ని విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘1990 నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. అప్పటి స్కూళ్ల వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు అన్నీ కళ్లకు కట్టేలా ఇందులో చూపించాం. అభిరుచి గల నిర్మాత దొరకడం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. అందరూ మనసుపెట్టి పనిచేసిన సినిమా ఇది’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు.