టాలీవుడ్ హీరో నాగార్జున తాజాగా ఓ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో తాను సమంత, నాగ చైతన్య గురించి మాట్లాడినట్టుగా వస్తున్న ప్రచారం అవాస్తవమని నాగ్ స్పష్టం చేశారు. సమంత, నాగచైతన్య గురించి నేను మాట్లాడాను.. అంటూ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. అది పూర్తిగా అవాస్తవం. రూమర్స్ను న్యూస్గా పోస్ట్ చేయొద్దని నేను మీడియా మిత్రులను కోరుతున్నాను.. అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోవడానికి అసలు కారణం సమంతేనని.. తనే ముందు విడాకులు కావాలని కోరిందని.. ఈ విషయంలో నాగ చైతన్య చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాడని నాగార్జున అన్నట్టుగా సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దానిపై నాగార్జున తాజాగా ట్వీట్తో క్లారిటీ ఇచ్చారు.