‘మా చిత్ర టీజర్ను తొలిసారి త్రీడీలో చూస్తూ చిన్నపిల్లాడిలా ఫీల్ అయ్యాను. అభిమానుల కోసం 60 థియేటర్లలో త్రీడీ టీజర్ ప్రదర్శించబోతున్నాం. థియేటర్లో ఎక్స్పీరియన్స్ కోసం తీసిన సినిమా ఇది. రానున్న పదిరోజుల్లో మరింత సర్ప్రైజింగ్ కంటెంట్తో మీ ముందుకొస్తాం. మీ అభిమానం, ఆశీస్సులు మాకు కావాలి’ అన్నారు ప్రభాస్. ఆయన టైటిల్ రోల్లో రామాయణ ఇతిహాస నేపథ్యంలో రూపొందించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్ర త్రీడీ టీజర్ను గురువారం హైదరాబాద్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అగ్ర నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ ‘టీజర్ నాకు బాగా నచ్చింది. మా టీమ్ వాళ్లు మాత్రం బయట నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పారు. ‘బాహుబలి’ చిత్రానికి కూడా ఇదే విధంగా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయని వాళ్లతో అన్నాను. అసలు సినిమా చూశాకే దాని రేంజ్ ఏమిటో తెలుస్తుంది.
ప్రభాస్ దేశవ్యాప్తంగా పెద్ద స్టార్గా ఎదిగాడు. ఈ సినిమా భారీ విజయం సాధించడం తథ్యం’ అన్నారు. త్రీడీ టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని దర్శకుడు ఓం రౌత్ తెలిపారు. ఈ సినిమా కోసం ప్రభాస్, ఓం రౌత్ చాలా కష్టపడ్డారని, ఎంతో భక్తిశ్రద్ధలతో సినిమా తీశామని నిర్మాతలు భూషణ్, రాజేష్ నాయర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.