Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడని తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ సినిమా సెట్స్పై ఉండగానే మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ మూవీ లవర్స్తోపాటు చిరు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. పవన్కల్యాణ్తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టందించిన హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్లో చిరు సినిమా ఉండబోతుందన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
తాజా టాక్ ప్రకారం చిరంజీవి కూతురు సుస్మిత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించనున్నారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మెగాస్టార్కు వీరాభిమాని అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయన చిరుతో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న అప్డేట్ నిజమైతే చిరంజీవితో సినిమా చేయాలన్న టీజీ విశ్వప్రసాద్ కల నెరవేరడం ఖాయమైపోయినట్టే. యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతుండగా.. బీవీఎస్ రవి కథనందించనున్నాడని టాక్ నడుస్తోంది. హరీష్ శంకర్ ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు.
మిస్టర్ బచ్చన్ తర్వాత పవన్ కల్యాణ్తో చేయనున్న ఉస్తాద్ భగత్ సింగ్తో బిజీ కానున్నాడు. ఈ రెండు కమిట్ మెంట్స్ పూర్తి చేసిన తర్వాత చిరంజీవితో చేయబోయే సినిమాపై ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. మరి ఈ క్రేజీ న్యూస్ రాబోయే రోజుల్లో ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.