HariHara VeeraMallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చాక సినిమాలు చేయడం తగ్గించారు. కొత్త ప్రాజెక్టులకి సైన్ చేయడం లేదు. గతంలో కమిటైన సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డారు. పవన్ గత కొద్ది రోజులుగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం వాయిదాల మీద వాయిదా పడుతుంది. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి దాదాపు ఐదేళ్లు అవుతుంది. . రాజకీయాల్లో బిజీగా మారిన పవన్ తన సినిమా ప్రాజెక్టులకు డేట్స్ కేటాయించలేకపోయాడు. అయినప్పటికీ, చేతిలో ఉన్న మూడు సినిమాలను పరిస్థితుల్లోనైనా ఆగస్టు లోగా పూర్తిచేస్తానని నిర్మాతలకు మాటిచ్చినట్టు సమాచారం.
తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేశారు. పవన్ కెరీర్లో తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఎట్టకేలకి షూటింగ్ చివరకు పూర్తయింది. చివరి రెండు రోజుల చిత్రీకరణకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెట్లో పవన్ కళ్యాణ్తో టెక్నికల్ టీం సభ్యులు దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హరిహర వీరమల్లు చిత్రీకరణ ముగిసిందని, రానున్న రోజులలో మూవీ అప్డేట్స్ వరుసగా రానున్నాయి అంటూ మేకర్స్ ప్రకటించారు . దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎన్నో రోజులుగా ఎదురు చేస్తున్న క్షణం వచ్చేసిందని ఖుషీ అవుతున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా ముగించి వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. మే 30 లేదా జూన్ రెండో వారంలో ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశముందని ఫిలింనగర్ టాక్. ఇక త్వరలో ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సినిమా విడుదల తేదీని అధికారికంగా వెల్లడించనున్నారు.జ్యోతి కృష్ణ, క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏ.ఎం. రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.