పవన్కల్యాణ్ నటిస్తున్న తొలి జానపద చిత్రం ‘హరిహరవీరమల్లు’. పవన్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది. చారిత్రాత్మక పాత్రల మేళవింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 75శాతం టాకీ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్సింగ్ సినిమాలను పూర్తిచేసే పనిలో పవన్ బిజీగా ఉన్నారు. మరి వీరమల్లుకు మోక్షమెప్పుడనేది అటు అభిమానుల్లోనూ ఇటు చిత్ర యూనిట్లోనూ అంతుప్టటని ప్రశ్నగా మారింది.
వందలకోట్ల వ్యయంతో రూపొందుతున్న పాన్ ఇండియా స్థాయి సినిమా ‘హరిహరవీరమల్లు’ కావడం చేత పవన్ ఈ సినిమాపై ప్రత్యేకశ్రద్ధ చూపిస్తున్నట్లు తెలిసింది. ఓజీ, ఉస్తాద్ భగత్సింగ్ సినిమాలను పూర్తిచేసి, ఆ తర్వాత ‘హరిహరవీరమల్లు’ సెట్కి రావాలని ఆయన నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్లో ‘హరిహరవీరమల్లు’ విడుదల ఉంటుందని తెలుస్తున్నది.