Hanuman Movie | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్వైడ్గా రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇదిలావుంటే తాజాగా హనుమాన్ టీమ్ ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలుసుకుంది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన హనుమాన్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సౌత్లో కంటే నార్త్లో ఆదరణ ఎక్కువ ఉంది. ఇందులో భాగంగా నేడు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను హనుమాన్ టీమ్ మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఇక ఈ భేటీలో దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు తేజ సజ్జా ఉన్నాడు. ఈ సినిమాను చిన్నారులు, యువత ఎంత ఆదరిస్తున్నారో సీఎం యోగికి ప్రశాంత్ వర్మ వివరించారు. అలానే మన భారత ఇతిహాసాల్లోని అంశాలను సూపర్ హీరో స్టోరీలో ఏ విధంగా చూపించామనేది ఆయనకి వివరించారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.