Gunturu Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం (Gunturu Kaaram). అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటిరోజే ఈ సినిమాకు కొంచెం మిక్స్డ్ టాక్ రావడంలో కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద గుంటూరు కారం కాసుల వర్షం కురిపించింది.
ఇక గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్లు చూసుకుంటే వరల్డ్వైడ్గా రూ.94 కోట్లు వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే దాదాపు రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మార్కెట్ వారీగా చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలలో రూ. 44.50 కోట్లు, కర్ణాటక రూ. 4.5 కోట్లు, తమిళనాడు రూ. 50 లక్షల , మిగిలిన రాష్ట్రాల్లో రూ. 50 లక్షల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. అయితే 2024లో ఒక నాన్ హాలిడే రోజు ఈ రేంజ్లో కలెక్షన్లు సాధించిన మొదటి రీజినల్ చిత్రంగా గుంటూరు కారం రికార్డు నమోదు చేసింది.
Biggest opening day ever for the Reigning Super 🌟 @urstrulyMahesh 🕺😎#GunturKaaram strikes a 𝐑𝐄𝐂𝐎𝐑𝐃 𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆 𝟗𝟒 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 Worldwide on Day 1 ~ 𝗔𝗟𝗟 𝗧𝗜𝗠𝗘 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 in regional cinema! 🔥🔥
Watch the #BlockbusterGunturKaaram at cinemas near you… pic.twitter.com/lzQFj4YVsU
— BA Raju’s Team (@baraju_SuperHit) January 13, 2024