Guntur Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్తో ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ ప్రముఖ ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో(Book My Show)పై కంప్లయింట్ ఫైల్ చేసింది.
‘గుంటూరు కారం’ సినిమాకు వ్యతిరేకంగా బుక్ మై షోలో 70,000 ఫేక్ ఓట్లు వేసి మూవీ రెప్యూటేషన్ దెబ్బతీశారని దీనిపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని గుంటూరు కారం టీమ్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ కూడా ‘బుక్ మై షో’ కి తమ సందేహాలు వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసింది. సినిమాలపై తప్పుడు ప్రచారం చేసేలా ఓటింగులు ఉన్నాయని, ‘గుంటూరు కారం’ చిత్రానికి వ్యతిరేకంగా ఫేక్ ఓట్లు ఎవరు వేయించారో ఆరా తీయాలని బుక్ మై షో నిర్వాహకుల్ని కోరింది. ఇక ఈ సినిమాకు విడుదల రోజు నుంచే ఫుల్ నెగిటీవిటీ స్ప్రెడ్ అయింది. సినిమా కథ రొటీన్గా ఉందని, గురూజీ డైలాగ్స్ కూడా వర్కవుట్ కాలేదని, స్క్రీన్ప్లే బోరింగ్గా ఉందని పేర్కొన్నారు. అయితే టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్లు మాత్రం పర్వాలేదనిపించేలానే వస్తున్నాయి.
ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటించింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ సినిమాను నిర్మించాడు.