Mahesh babu | మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత వీళ్ల కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అందరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఇక ఈ మధ్య విడుదలైన గ్లింప్స్కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. మహేష్ను మాస్ యాంగిల్లో చూసి చాలా కాలం అయింది. టీజర్తో ఆ లోటు కూడా తీరిపోయింది. టీజర్లోనే ఈ రేంజ్లో మహేష్ను చూపించిన త్రివిక్రమ్.. సినిమాలో ఇంకెలా చూపిస్తాడో అని తెగ క్యారియాసిటీతో ఉన్నారు సూపర్ స్టార్ అభిమానులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
కాగా తాజాగా మేకర్స్ ఫిక్స్ చేసుకున్న డేట్ కంటే ముందే కీలక షెడ్యూల్ను కంప్లీట్ చేసుకుందట. దాంతో తరువాత షెడ్యూల్ రెండు రోజులు ముందుకి జరిపి జూలై 20 వరకు ఏకధాటిగా షూటింగ్ చేయబోతున్నారట. మహేష్ కూడా అవుట్ పుట్ చూసి ఫుల్ ఖుషీ అయినట్లు ఇన్సైడ్ టాక్. ఈ రేంజ్లో షూటింగ్ సాగితే అనుకున్న డేట్కు బాబు ల్యాండ్ అవడం ఖాయం అని పలువురు సినీ లవర్స్ వెల్లడిస్తున్నారు. ఇక ఇటివలే ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా తప్పుకుంది. ఆమె ప్లేస్లో శ్రీలీల ఫిక్సయిపోయింది. సెకండ్ హీరోయిన్గా మీనాక్షీ చౌదరీ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లేనట. థమన్ స్వరాలందిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసనీ క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు.