Guna Sekhar | ‘రుద్రమదేవి’ తర్వాత దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని ‘శాకుంతలం’ సినిమాతో మళ్లీ మెగాఫోన్ పట్టాడు గుణశేఖర్. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అడుగడునా అడ్డంకులే ఎదురయ్యాయి. రేపొస్తుంది.. మాపొస్తుంది అంటూ ఎన్నో సార్లు ఈ సినిమాను వాయిదా వేశారు. ఇక ఎట్టకేలకు ఏప్రిల్ 14న ఈ సినిమాకు ముహూర్తం కుదిరింది. దిల్రాజు ఈ సినిమాను భారీ లెవల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతుంది. ముఖ్యంగా సమంత తీరిక లేకుండా ఇంటర్వూలిస్తూ సినిమాకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. పైగా సమంత నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ క్రమంలో నార్త్లోనూ మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. బాలీవుడ్ మీడియాకు పలు ఇంటర్వూలు ఇస్తూ సినిమాను హిందీ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానిక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా గుణశేఖర్ ఈ సినిమా గురించి, సామ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. నార్త్లో సమంతను అందరూ దిల్రాజు గారి కూతురు అనుకుంటున్నారని గుణశేఖర్ తెలిపాడు. ఇప్పటివరకు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఖరీదైన చిత్రం ఇదేనని, దిల్రాజు అంత ఇన్వెస్ట్ చేయడంతో సమంత దిల్రాజు కూతురు అయ్యింటుందని పలువురు అన్నట్లు గుణశేఖర్ వెల్లడించాడు. హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా కీలకపాత్ర పోషిస్తున్నాడు.