క్యూట్ లుక్స్తో ఎప్పుడు ప్రేక్షకులకి సందడి పంచే హీరోయిన్ జెనీలియా. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. భర్తతో పిల్లలతో కలిసి చేసే సందడికి సంబంధించిన పిక్స్, వీడియోలు కూడా జెనీలియా సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ నెటిజన్స్ని ఎంటర్టైన్ చేస్తుంటుంది.ఈ క్రమంలోనే హోలీ సందర్భంగా జెనీలియా- ప్రీతి జింతా -రితేష్కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. దీనిపై కొందరు నెటిజన్లు ‘వల్గర్ ఆంటీ’ అంటూ ట్రోల్ చేశారు.
వీడియోలో ప్రీతి జింటాని రితేశ్ చేతులపై ముద్దు పెట్టకోగా, జెనీలియా జలసీతో చూస్తూ ఉంది. అయితే ఈ వీడియోని తాజాగా అర్బాజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న డిజిటల్ షో ‘పించ్’లో చూపించారు. అంతేకాదు దానికి ‘సిగ్గు లేదా, వల్గర్ ఆంటీ. ఎప్పుడూ ఓవర్ యాక్టింగ్ చేస్తుంటావ్. ఇది నీ ముఖానికి సెట్ అవ్వదు’ అని పెట్టిన కామెంట్స్ని కూడా అర్భాజ్ చదివాడు. దానికి సమాధానం ఇచ్చిన జెనీలియా ..అతని ఇంట్లో పరిస్థితులు బాలేనట్లు ఉన్నాయి అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. భాయ్ సాబ్, మీరు ఇంట్లో బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను అని పేర్కొంది.
ఈ ట్రోలింగ్పై మాట్లాడిన రితేష్.. పాపులారిటీ ఉన్నవాళ్లకి ఇలాంటి విమర్శలు మాములే అని, వీటి గురించి పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదంటూ రితేష్ చెప్పుకొచ్చారు.పించ్ షోలో వీరు చేసిన సందడికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.