శ్రీకాంత్, వరలక్ష్మి శరత్కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో జీఏ2 పిక్చర్స్ సంస్థ రూపొందిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, విద్య మాధురి నిర్మిస్తున్నారు. తేజ మర్నిదర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి బన్నీ వాసు కుమార్తె హన్విక క్లాప్నిచ్చారు. ‘కంటెంట్ ప్రధానంగా సాగే చిత్రమిది.
వినూత్న కథతో మెప్పిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. మురళీ శర్మ, బెనర్జీ, పవన్తేజ్ కొణిదెల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, ఆర్ట్: గాంధీ నడికురికర్, సంగీతం: శక్తికాంత్ కార్తీక్, రచన: నాగేంద్ర కాశీ, సహనిర్మాత: భాను ప్రతాప, దర్శకత్వం: తేజ మర్ని.