Fahadh Faasil | మలయాళ యాక్టర్ ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) పుష్ప ప్రాంఛైజీలో భన్వర్సింగ్ షెకావత్ పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే పుష్ప ది రైజ్లో ఒక్కటి తగ్గింది.. అంటూ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. ఇటీవలే యాక్షన్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఆవేశం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్పై దండయాత్ర చేస్తు్న్నాడు. ఈ చిత్రం వరల్డ్వైడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.150 కోట్లు గ్రాస్ రాబట్టి.. ఫహద్ ఫాసిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.
తాజాగా ఫహద్ ఫాసిల్ మరో క్రేజీ వార్తను అందరితో షేర్ చేసుకున్నాడు. దృశ్యం ప్రాంఛైజీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ (Jeethu Joseph)తో కొత్త సినిమా ప్రకటించాడు. E4 Entertainment బ్యానర్ ఈ సినిమాను తెరకెక్కించనుంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రం ఫహద్ఫాసిల్-జీతూ జోసెఫ్ కాంబోలో వస్తున్న తొలి సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి శాంతి మాయాదేవి కథనందిస్తుండగా.. మరిన్ని వివరాలపై మేకర్స్ రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు.
ఫహద్ ఫాసిల్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప ది రూల్లో నటిస్తున్నాడు. మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తోన్న తలైవా 171 ప్రాజెక్ట్ Vettaiyanలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Associating Jeethu Joseph and Fahadh Faasil, produced by E4 Entertainment, written by Santhi Mayadevi !!@jeethu4ever #FahadhFaasil #SanthiMayadevi @cvsarathi @e4echennai @E4Emovies pic.twitter.com/MazthC4omW
— E4 Entertainment (@E4Emovies) May 16, 2024