సాక్షి, రాజేంద్ర, దేవిశ్రీ, శ్రావణ సంధ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ద్రౌపది’. రామ్ కుమార్ దర్శకత్వంలో బొడ్డుపల్లి బ్రహ్మచార్య నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఇటీవలే ఆడియోను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘అందరూ కొత్తవారితో ఈ సినిమాను రూపొందించాం.
వినూత్న కథతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు. ‘ద్రౌపది అనే బలమైన పాత్రలో సాక్షి చక్కటి అభినయాన్ని కనబరిచింది. జగిత్యాలలో ఓ పాట చిత్రీకరణ చేశాం. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయి’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం: జయసూర్య, రవి ములకలపల్లి, సంభాషణలు: అశోక్ వడ్లమూడి.