Disha Patani | బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని సినిమాలలో అలరిస్తూనే సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు మతి పోగొడుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ నెటీజన్లను ఆకర్షిస్తుంటుంది. మెగాహీరో వరుణ్తేజ్ నటించిన ‘లోఫర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ‘ఎమ్.ఎస్ ధోని’, ‘బాగీ-2’,3 వంటి సినిమాలతో ఈ అమ్మడి క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఈమె చేతి నిండా ప్రాజెక్ట్లతో తీరిక లేకుండా గడుపుతుంది. తాజాగా ఈమె ప్రభాస్ సినిమాలో నటించనున్నట్లు ప్రకటించింది.
ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ‘రాధేశ్యామ్’తో భారీ ఫ్లాప్ను మూటగట్టుకున్న ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాలపై పూర్తి శ్రద్ధను పెడుతున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. ‘మహానటి’ ఫేం నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కనుంది. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలో దిశాపటాని కూడా నటించనున్నట్లు వెల్లడించింది. ప్రాజెక్ట్-K మేకర్స్ దిశాపటానికి వెల్కమ్ చెప్తూ ఫ్లవర్ బొకేను పంపారు. దీన్ని దిశా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితియార్థంలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దిశా ప్రస్తుతం నటించిన ‘ఏక్ విలన్ రిటర్న్స్’, ‘యోదా’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీనితో పాటుగా ‘కేటినా’ చిత్రీకరణ జరుపుకుంటుంది.