అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్ నాయికలుగా నటిస్తున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించగా, దర్శకత్వం వహించారు శశికిరణ్ తిక్క. రేపు సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్రానికి పనిచేసిన అనుభవాలను, సినిమా విశేషాలను తెలిపారు శశికిరణ్. ఆయన మాట్లాడుతూ…‘ముంబై ఉగ్రదాడుల్లో ఎంతోమందిని కాపాడి అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహసం మనందరికీ తెలుసు.
ఆయనలో గొప్ప మానవత్వం ఉంది. ఈ కథను తెరకెక్కించడం ద్వారా సందీప్ గొప్పదనం ప్రపంచానికి చూపించాలని అనుకున్నాం. ఈ సినిమా చేస్తే చరిత్రలో నిలిచిపోతుంది అనిపించింది. అందుకే నేను మరో సినిమాకు పనిచేస్తున్నా, అది వాయిదా వేసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించా. ఈ సినిమా చిత్రీకరణ ఒక సవాలులా అనిపించింది. సితార ఎంటర్టైన్మెంట్స్లో నా తదుపరి సినిమా ఉంటుంది’ అన్నారు.