Dhanush | కోలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోల్లో ఒకరు ధనుష్. ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి టైటిల్ రోల్ పోషిస్తున్న కెప్టెన్ మిల్లర్ (Captain Miller). ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతోపాటు ధనుష్ కథనందిస్తూ స్వీయదర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం D 50. మరోవైపు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో D 51కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఓ వైపు వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ధనుష్కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి అభిమానులు, మూవీ లవర్స్ను ఖుషీ చేస్తోంది.
ధనుష్ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్లో నటించబోతున్నారన్న న్యూస్ ఒకటి టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. 2024లో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుందని, 2025లో థియేటర్లలో సందడి చేయనుందని నెట్టింట న్యూస్ హల్ చల్ చేస్తోంది. Connekkt Media ఈ సినిమాను తెరకెక్కించనుందట. అయితే దీనిపై ధనుష్ నుంచి కానీ, ఇళయరాజా కాంపౌండ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి రానున్న రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
అరుణ్ మథేశ్వరన్ డైరెక్షన్లో నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోంది. ఈ మూవీలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన కెప్టెన్ మిల్లర్ లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కెప్టెన్ మిల్లర్ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సొంతం చేసుకుంది.
కెప్టెన్ మిల్లర్ టీజర్..