టాలీవుడ్లో సెన్సిబుల్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్కు పెద్దపీట వేసే ఆయన ‘లీడర్’ చిత్రం ద్వారా పొలిటికల్ నేపథ్య కథల్ని కూడా సమర్థవంతంగా తెరకెక్కించగలనని నిరూపించుకున్నారు. ఆయన మరోసారి ఓ రాజకీయ నేపథ్య కథాంశంతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్మీదకు రానుంది. 1950 నేపథ్యంలో సాగే పొలిటికల్ కథాంశంతో శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ సిద్ధం చేశారని అంటున్నారు. ఈ సినిమాలో మద్రాస్లో జీవించే తెలుగు యువకుడిగా ధనుష్ కనిపిస్తారని సమాచారం. రష్మిక మందన్న కథానాయికగా నటించనుందని తెలిసింది. సుదీర్ఘ విరామం తర్వాత శేఖర్ కమ్ముల ఓ రాజకీయ నేపథ్య ఇతివృత్తాన్ని ఎంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.