బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్సింగ్-దీపికాపడుకోన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఇటీవల ముంబయి మీడియాలో వరుస కథనాల్ని ప్రచురించారు. గత కొంతకాలంగా వారి వైవాహిక జీవితం సాఫీగా సాగడం లేదని, కలహాలతో కాపురం సాగిస్తున్నారని వార్తలొచ్చాయి. వీటిపై దీపికాపడుకోన్ ఓ టాక్షో వేదికగా స్పందించారు. రణ్వీర్సింగ్తో దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతున్నదని, ఇద్దరం పరస్పర ప్రేమాభిమానాలతో ఉన్నామని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘వరుస సినిమా కార్యక్రమాలతో పాటు కొన్ని ప్రైవేట్ మ్యూజిక్ ఈవెంట్స్లో పాల్గొంటూ రణ్వీర్ చాలా బిజీగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఇటీవలే ఇల్లు చేరుకున్నాడు. మేమిద్దరం కలిసి ఉండక చాలా రోజులు కావడంతో దూరం పెరిగిందంటూ వార్తలు రాశారు. మేం చాలా సంతోషంగా ఉన్నాం. మా బంధం కలకాలం ఇలాగే నిలిచిపోతుందనే విశ్వాసం ఉంది’ అని చెప్పింది. నాలుగేళ్ల క్రితం ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం దీపికాపడుకోన్ బాలీవుడ్తో పాటు హాలీవుడ్పై కూడా దృష్టిపెడుతున్నది. ప్రస్తుతం ఆమె తెలుగులో ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్-కె’లో కథానాయికగా నటిస్తున్నది.