సందర్భానికి తగ్గట్టు స్పందించడంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ ముందుంటుంది. తనకు నచ్చిన విషయాలకు బేషరతుగా మద్దతిచ్చే ఆమె, ఏదైనా నచ్చకపోతే అంతే ఘాటుగా విమర్శిస్తుంది. తరచూ సహనటులపై వాగ్బాణాలు ఎక్కుపెట్టే కంగనా తాజాగా దీపికా పదుకోన్పై ప్రశంసల జల్లు కురిపించింది. ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో తళుక్కున మెరిసిన దీపికను ఆకాశానికెత్తేసింది. ‘ఆస్కార్ వేదికపై దీపిక కనిపించిన తీరు అదిరిపోయింది.
భారత్కు ప్రతినిధిగా ఆమె మనదేశ గౌరవాన్ని తన భుజాలపై సమర్థంగా మోసింది. దీపిక మాట్లాడిన తీరు అద్భుతం’ అంటూ ట్వీట్ చేసింది. గతంలో దీపికను పలు సందర్భాల్లో విమర్శించిన కంగనా అకస్మాత్తుగా ఆమెను మెచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది. దీనిపై స్పందిస్తూ ‘నేను కృష్ణతత్వాన్ని ఫాలో అవుతాను. ఏదైనా పనిలో ఒకరికే క్రెడిట్ ఇవ్వడం తప్పు! కానీ, అందులో వారి పనితనాన్ని గుర్తించకపోవడం అంతకన్నా పాపం’ అంటూ వివరణ ఇచ్చింది.