సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘దర్జా’. పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీత దర్శకుడు. ఈ నెల 22న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా చిత్ర ఆడియో విశేషాలు తెలిపారు ర్యాప్ రాక్ షకీల్. ఆయన మాట్లాడుతూ…‘ఇదొక కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా.
కథకు తగిన సంగీతాన్ని అందించాను. ఇప్పటికే విడుదల చేసిన ‘లింగా లింగా..’ పాటకు ఒక రోజులో మిలియన్ వ్యూస్ వచ్చాయి. కొత్త తరహా స్వరాలు వింటారు. ప్రేక్షకులు ఆదరిస్తేనే వైవిధ్యమైన సంగీతాన్ని అందించగలం. ఈ సినిమాలోని పాటలతో పాటు నేపథ్య సంగీతానికీ పేరొస్తుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం ‘బ్లాక్ మ్యాన్’ అనే ఇంగ్లీష్ మూవీతో పాటు ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నా’ అన్నారు.