Costumes Krishna Passes Away | టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ మరణించాడు. గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణ ఆదివారం తెల్లవారు జామున చెన్నైలోని ఆయన స్వగృహంలో మృతి చెందాడు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
విలన్గా, సహాయ నటుడిగా పలు సినిమాల్లో మెప్పించిన కాస్ట్యూమ్స్ కృష్ణ కెరీర్ బిగెనింగ్లో సురేష్ ప్రొడక్షన్ సంస్థలో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశాడు. తెలుగులో అనేక సినిమాలకు కృష్ణ కాస్ట్యూమ్స్ అందించాడు. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారత్ బంద్’ సినిమాతో నటుడిగా మారాడు. ఆ తర్వాత ‘పెళ్లాం చెబితే వినాలి’, ‘అల్లరి మొగుడు’, ‘దేవుళ్ళు’, ‘మా ఆయన బంగారం’, ‘పుట్టింటికి రా చెల్లి’ వంటి పలు సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించాడు.
నటుడిగానే కాకుండా నిర్మాతగానూ కృష్ణ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జగపతిబాబు హీరోగా నటించిన ‘పెళ్లి పందిరి’ సినిమాను నిర్మించింది కృష్ణనే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్బస్టర్ హిట్టయింది. అంతకు ముందు కన్నడలో సూపర్ హిట్టయిన ఓ సినిమాను ‘అరుంధతి’ పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు. నిర్మాతగా కృష్ణ 8 సినిమాలు తీశారు.