అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం పుష్ప. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం చిత్ర బృందం చాలా కష్టపడింది. ప్రమోషన్ కార్యక్రమాలలో వారు పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు. సుమారు రెండు గంటలపాటు మేకప్ కోసమే కేటాయించాల్సి వచ్చేదని, తెల్లవారుజామున 4.30 నిద్రలేచి.. ఐదుకల్లా సెట్కెళ్లి.. 5 నుంచి 7 వరకూ మేకప్ కోసమే ఓపిగ్గా కూర్చొవాలి. షూట్ పూర్తయ్యాక మేకప్ తీయడానికి మరో 20 నుంచి 40 నిమిషాలు పట్టేదని బన్నీ అన్నారు.
పాత్రలు చక్కగా సిద్ధం చేయడానికి మేకప్ బాయ్స్ అందరూ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమాలో నటీనటులు కేవలం ముఖానికి మాత్రమే కాకుండా చాలా షాట్స్లో శరీరానికి కూడా మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది అని అల్లు అర్జున్ తెలిపారు. ఎంతో ఎఫర్ట్ పెట్టి సినిమా చేసిన నేపథ్యంలో అందరు కూడా మూవీ మంచి విజయం సాధించాలని కోరుతున్నారు.
తాజాగా చిరంజీవి తన ట్విట్టర్ లో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, రష్మిక, మైత్రి మూవీ మేకర్స్ తో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. మీరందరు సినిమా కోసం చెమట చిందించారు. ఎంతో నిబద్ధతో పని చేశారు. మీరు సినిమా కోసం చేసిన ప్రయత్నాలు అన్ని అభినందనీయం అంటూ చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు.
పుష్ప సినిమా షూటింగ్ కోసం మారుమూల గ్రామాలకు కూడా వెళ్లారట. అటవీ ప్రాంతంలో షూట్.. కొన్నిసార్లు మనమే రోడ్లు వేసుకోవాలి. రాత్రికి రాత్రి మట్టి తెప్పించి.. రోడ్డు వేసి లారీలు, కార్లు వేసుకుని సెట్కి వెళ్లేవాళ్లం. కొన్నిసార్లు వర్షాలు పడి, వాహనాలు ఆగిపోయి సెట్కి వెళ్లడానికీ ఇబ్బందులు పడ్డాం. చేసేది లేక బౌన్సర్ల బైక్పై సెట్కి వెళ్లేవాడిని. ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లు ‘పుష్ప’ నాలుగు సినిమాల కష్టం. ఈ సినిమా కోసం రోజుకి దాదాపు 500 నుంచి 600 మంది పనిచేసేవాళ్లు. 300 వాహనాలు సెట్లో ఉండేవి అంటూ బన్నీ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు.