మెగాస్టార్ చిరంజీవి కరోనా వలన కొద్ది రోజులుగా ఇంటికే పరిమితం కాగా, ఇప్పుడు ఆయన మళ్లీ ఫంక్షన్స్, సినిమా షూటింగ్స్ అంటూ బిజీబిజీగా కాలం గడుపుతున్నారు. ఇటీవల తన 66వ బర్త్ డేని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య సంతోషంగా జరుపుకున్న చిరు ఆ తర్వాత ఫలక్నుమా ప్యాలెస్లో జరిగిన మీటింగ్కి హాజరయ్యారు. అక్కడ కపిల్దేవ్ని కలిసి వారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కుమారుడు అనుదీప్ నిశ్చితార్థం స్నికితతో హైదరాబాద్లో హైటెక్సిటీలోని హైటెక్స్ కన్వెన్షన్లో ఘనంగా జరగగా, ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా ఈ వేడుకకి హాజరు కాగా,నూతన దంపతులకు ఉంగరాలని అందించి ఆశీర్వదించారు.
సినీ పరిశ్రమ నుండి కైకాల సత్యనారాయణ,బండ్ల గణేష్ వంటి ప్రముఖులు కూడా వేడుకలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 20 మంది ఎంపీలు, 100 మంది ఎంఎల్ఏలు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, ఎస్.గోపాల్రెడ్డి, రమేశ్వర్మ, త్రినాధరావు నక్కినలు, నిర్మాతలు కోనేరు సత్యనారయణ, మహేశ్ రెడ్డి, లగడపాటి శ్రీధర్, దాసరి కిరణ్కుమార్, విసు, సంగీత దర్శకులు కోటి, టాలీవుడ్ అగ్ర రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు కూడా పాల్గొన్నారు.