తెలంగాణ గవర్నర్ తమిళ సైకి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. కరోనా క్రైసిస్ చారిటీకి సహకరిస్తున్న ప్రతీ సభ్యునికి మీ ప్రశంసలు మరింత ఉత్తేజాన్నిస్తాయన్నారు. గతేడాది లాక్ డౌన్ తో సినీపరిశ్రమ బాగా దెబ్బతింది. దీనిపై ఆధారపడిన వేల కుటుంబాలు రోడ్డున పడకుండా చిరంజీవి చొరవ తీసుకున్నారు. సినీపెద్దలతో కలిసి ప్రభుత్వ అండతో కరోనా క్రైసిస్ చారిటీని ఏర్పాటు చేశారు. దాదాపు ఆరునెలలు ప్రతీ కుటుంబానికి అవసరమైన నిత్యావసరవస్తువులు, ఆర్థిక సాయం అందించారు.
ఈ సెకండ్ వేవ్ లోనూ మరోసారి చిరంజీవి సినీ కార్మికులకు అండగా నిలిచారు. 45 ఏళ్లు దాటి వారందరికీ ఉచితంగా టీకా అందజేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం సినీ పరిశ్రమలో పనిచేసే వారే కాదు వారి కుటుంసభ్యులకు కూడా ఈ టీకాని ఉచితంగా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
సినీకార్మికులకు ఉచిత టీకా పంపిణీపై చిరంజీవి తలపెట్టిన కార్యక్రమాన్ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ గవర్నర్ తమిళ సై అభినందించారు.