Acharya Movie | మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదలై మొదటి షో నుండి నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. కథ భాగానే ఉన్న కథనం కొత్తగా లేదని.. కొరటాల మార్కు ఈ చిత్రంలో కనిపించలేదని ప్రేక్షకులు తెలిపారు. ఈ సినిమాలో కొరటాల డైలాగ్స్ గాని, ఎలివేషన్స్ గాని ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ భారీగానే వచ్చిన.. రెండో రోజు నుండి ఫుల్ డ్రాప్స్ పడ్డాయి. వారంలోపే చాలా వరకు థియేటర్లలో నుండి ఆచార్య వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమాతో నిర్మాతలకు ఏకంగా రూ.80 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. ఈ నష్టాలను పూడ్చడానికి కొరటాల శివ తన ఆస్తులను అమ్మాడని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా నష్టపోవడంతో చిరంజీవి, రామ్చరణ్ తమ రెమ్యూనరేషన్లో 80శాతం రిటర్న్ ఇచ్చినట్లు చిరు తాజాగా వెల్లడించాడు. అంతేకాకుండా ఒక సినిమా ఫేయిల్ అయితే రెస్పాన్సిబులిటీ మొత్తం నేనే తీసుకుంటానని తెలిపాడు. దీనిపై పలువురు నెటీజన్లు చిరును అభినందిస్తున్నారు. కాగా ఆచార్య టైంలో చిరు సినిమా ఫలితంపై స్పందించక పోవడంతో చిరుపై నెగెటీవ్గా ప్రచార జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం తెలియడంతో చాలా మంది చిరును అభినందిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘గాడ్ఫాదర్’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. మోహన్రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించింది. ఇక చిరంజీవి ప్రస్తుతం ‘మెగా154’, ‘భోళా శంకర్’ సినిమాలను చేస్తున్నాడు.